12, డిసెంబర్ 2025, శుక్రవారం

భాగ్యదేవత (1959) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

 

1959 లో విడుదలైన ఒక క్లాసిక్ తెలుగు చిత్రం భాగ్యదేవత. దీనిని అలనాటి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సారథీ స్టూడియోస్ అధినేత యార్లగడ్డ రామకృష్ణప్రసాద్  నిర్మించారు.  ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇది విధి, ప్రేమ మరియు త్యాగం గురించిన కథ. ఇందులో కొంగర జగ్గయ్య, సావిత్రి, రాజసులోచన, సూర్యకాంతం, రేలంగి ప్రధాన పాత్రల్లో నటించారు. మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. దీనిని తమిళంలో భాగ్య దేవతైగా నిర్మించారు. ముఖ్యమైన విషయమేమిటంటే ఉభయభాషలలో దీన్ని హైదరాబాదులో నిర్మించారు. తమిళ చిత్రంలో జెమినీ గణేషన్ మరియు సావిత్రి నటించారు, ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. అందులో ఘంటసాల మాస్టారు రెండు  యుగళగీతాలను, ఒకటి పి.సుశీలతో మరొకటి జమునారాణితోను, ఒక ఏకగళగీతాన్ని పాడారు.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాత & దర్శకుడుదర్శకుడు
15723.10.1959శ్రీ సారథీ స్టూడియోస్భాగ్యదేవతమాస్టర్ వేణుసారథీ స్టూడియోస్తాపీ చాణక్య

~ ఘంటసాల మాస్టారు పాడిన పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1వెతుకాడే కన్నులలోనా(యు)శ్రీశ్రీఘంటసాల, జమునారాణీబాలయ్య, రాజసులోచన
2మదిని హాయి నిండెగా(యు)శ్రీశ్రీఘంటసాల, పి.సుశీలజగ్గయ్య, సావిత్రి
3హరేహరే రాం సీతారాం(ఏ)కొసరాజుఘంటసాలరేలంగి

                              యు - యుగళగీతం; ఏ - ఏకగళగీతం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి